సరిహద్దులో పాకిస్తాన్ కుట్రలు కొనసాగుతున్నాయి. LOC దగ్గర పాకిస్తాన్ డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. సరిహద్దు గ్రామాల్లో గత కొద్దిరోజులుగా పాకిస్తాన్ డ్రోన్లు ఆయుధాలతో పాటు డ్రగ్స్ను జారవిడుస్తున్నాయి. ఆర్మీ అధికారులు వెంటనే యాంటీ డ్రోన్ సిస్టమ్ను యాక్టివేట్ చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడోసారి ఆర్మీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలోని పూంచ్లోని దేగ్వార్ ప్రాంతంలో కొన్ని అనుమానిత పాకిస్తాన్ డ్రోన్లను గుర్తించిన భారత సైన్యం గురువారం కాల్పులు జరిపింది.

