బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 243 మంది ఎమ్మెల్యేలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), బిహార్ ఎలక్షన్ వాచ్ సంచలన నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం కొత్త ఎమ్మెల్యేల్లో సగం మందికిపైగా (130 మంది) క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆరుగురిపై హత్య కేసులు ఉన్నాయి. ఈసారి ఎన్నికైన ఎమ్మెల్యేలలో 218 మంది (90 శాతం) కోటీశ్వరులే. ఆయా ఎమ్మెల్యేలు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు

