రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ “100 సంవత్సరాల సంఘ యాత్ర – న్యూ హారిజన్స్” కార్యక్రమం మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ కీలక ప్రసంగం చేశారు.
సంఘ్ను దూరం నుండి చూడటం వల్ల అపార్థాలు ఏర్పడతాయని అన్నారు. “ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు రూట్ మార్చ్లు నిర్వహిస్తారు, కానీ ఆర్ఎస్ఎస్ పారామిలిటరీ సంస్థ కాదు” అని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీ కాదని అన్నారు. ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు అందులో ఉన్నారన్నారు.

