
పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని ఆ ఫలితంగా షేక్ రియాజ్ తక్షణమే మరణించాడని పత్రికల్లో వచ్చిన నివేదికల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసినట్లు మానవ హక్కుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఏదైనా మెజిస్టీరియల్ లేదా జ్యుడీషియల్ విచారణ స్థితి, ఎన్కౌంటర్ మరణాలపై సుప్రీంకోర్టు, ఎన్హెచ్ఆర్సి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న వివరాలు, ఎఫ్ఐఆర్, పోస్ట్మార్టం నివేదిక కాపీలతో సహా వచ్చే నెల 24 నాటికి సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషన్ తెలంగాణ డిజిపిని ఆదేశించింది.