ప్రస్తుతం తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఇప్పటికే వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని… శ్రీలంక తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. వీటి ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండగా ఏపీలో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు.

