శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ మహిళా జట్టు 30 పరుగుల తేడాగా విజయం సాధించింది. దీనితో 5 మ్యాచ్ల సిరీస్లో 4 విజయాల అధిక్యంలోకి వెళ్లింది. చివరి మ్యాచ్లో కూడా గెలిచి శ్రీలంకను వైట్వాష్ చేస్తారో లేదో చూడాలి. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోర్ చేసింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 221 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. అయితే భారత్ విధించిన 221 టార్గెట్ను ఛేదించలేక శ్రీలంక చతికిలపడింది.

