శబరిమల మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుమిలి నుంచి పంబ వైపు వెళ్లే రహదారిపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే, తిరిగి వచ్చే భక్తులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా ఈ కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. వర్షాల ధాటికి ఈ ప్రాంతంలోని జలపాతాలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారిపై మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది.

