
తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా ఉంటుందని తెలంగాణా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. అవకాశం ఉన్న ప్రతిచోటా మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామని అన్నారు. ప్రజాభవన్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఆర్టిసికి అద్దె బస్సులు అందించిన మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. వ్యాపారం చేసుకునే మహిళలను ప్రోత్సహిస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలియజేశారు.