
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాల గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం రేపు ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానుండటంతో జిల్లా రాజకీయ వేడి పెరిగింది. భద్రతా కారణాలతో పోలీసులు జగన్తో పాటు కేవలం వంద మందికే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చారు.