
ఫిడే (International Chess Federation) మహిళల గ్రాండ్ ప్రిక్స్ సిరీస్లో భారత యువ గ్రాండ్మాస్టర్ వైశాలి రమేశ్బాబు తొలి విజయం నమోదు చేసింది. ఐదో రౌండ్లో తెల్లపావులతో బరిలోకి దిగిన వైశాలి.. బక్తుయగ్ (మంగోలియా)ను ఓడించింది. ఈ గెలుపుతో ఆమె టాప్-5లోకి దూసుకొచ్చింది. నాలుగు పాయింట్లతో చైనా క్రీడాకారిణి జైనర్ అగ్రస్థానంలో ఉండగా తర్వాత నాలుగు స్థానాల్లో భారత్కు చెందిన కోనేరు హంపి (3.5), దివ్య దేశ్ముఖ్ (3.5), వైశాలి (2.5), హారిక (2.5) ఉన్నారు.