జిల్లా కేంద్రంలోని 16వ నెంబర్ మద్యం షాపునకు ఇటీవల జరిగిన టెండర్లలో రామ్నగర్ ప్రభుత్వ పాఠశాలలో పిఇటిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భూపాని పుష్ప పాల్గొన్నారు. ఆ టెండర్ల లక్కీ డిప్లో షాపు ఆమెకు దక్కింది. అయితే సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు టెండర్లలో పాల్గొనకూడదని మద్యం షాప్ టెండర్ దారులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వైన్ షాప్ దక్కించుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఇఒ శనివారం సస్పెన్షన్ వేటు చేశారు.

