
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మాట్లాడుతు ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడ ఉన్న నాయకులు బొత్స సత్యనారాయణ హుటాహుటిన కారులోకి ఎక్కించి హాస్పిటల్కి తరలించారు. అయితే ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం కుదుటపడిందని….ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు అనుచరులు తెలిపారు.