
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. మరియా కొరినా మచాడో కు ఈ ఏడాదికి సంబంధించిన నోబెల్ శాంతి పురస్కారం వరించింది. మరియా కొరినా మచాడో వెనిజులా పార్లమెంట్ సభ్యురాలు. వెనిజులా ప్రజల కోసం మరియా కొరినా మచాడో చేసిన అవిశ్రాంత కృషి, వారి హక్కుల కోసం చేసిన పోరాటం ఫలితంగానే ఆమెకు ఈ నోబెల్ బహుమతి దక్కినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ వెల్లడించింది.