
విశాఖపట్నం జిల్లా సీతంపేటలో పెనుప్రమాదం తప్పింది.బెల్లం గణపతి ఆలయం దుర్గాదేవి మండపం వద్ద జరిగిన ఒక దుర్ఘటనలో 16 మంది చిన్నారులకు గాయాలు అయ్యాయి. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు మరియు చిన్నారులు హాజరయ్యారు. అయితే వంట చేస్తున్న సమయంలో మరుగుతున్న వేడి గంజి ప్రమాదవశాత్తు వారిపై పడింది. దీంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.