టెక్ దిగ్గజం గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ 1 గిగా వాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్ ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతి పెద్ద డేటా సెంటర్గా నిలవనుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఫోన్లో మాట్లాడారు. తమ కంపెనీ తొలి ఏఐ హబ్ విశేషాలను ప్రధానికి వివరించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు.

