
అహ్మాదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. కానీ, ఒక్క వ్యక్తి మాత్రం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విమానంలోని 11ఏ సీటులో కూర్చున్న ప్రయాణికుడు 38 ఏళ్ల విశ్వస్ కుమార్ రమేష్ ప్రమాదం జరిగిన తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడి.. శిథిలాల నుంచి బయటికి నడుచుకుంటూ వస్తున్న వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. రమేష్ బ్రిటీష్ పౌరుడు.