దేశ రాజధాని ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం గాల్లో వెళ్తుండగానే సాంకేతిక సమస్య తలెత్తడంతో గురువారం మధ్యాహ్నం తిరిగి జాతీయ రాజధానికి చేరుకుంది. ఏఐ111 విమానం గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలో టేకాఫ్ అయింది గాలిలో ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో అనుమానిత సాంకేతిక లోపాన్ని సిబ్బంది గుర్తించారు. దాంతో దాదాపు ఏడు గంటల ప్రయాణం తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు విమానాన్ని తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు

