తమిళగ వెట్రి కజగం నాయకుడు విజయ్ తిరిగి పార్టీ ప్రచారం ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కరూర్ తొక్కిసలాట లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా విజయ్ రోడ్షోలను రద్దు చేసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రచార శైలిని అనుసరించే లక్ష మందికి వసతి కల్పించగల ప్రాంతంలో నగరం వెలుపల జనాన్ని సమీకరించి.. విజయ్ హెలికాప్టర్లో వేదికకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు.

