
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించిన తాజా నిర్ణయం దీనికి నిదర్శనం. విజయవాడ – సింగపూర్ మధ్య ఇండిగో ఎయిర్లైన్స్ నవంబర్ 15 నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుంది. ఈ సర్వీసులు వారానికి మూడు రోజులు – మంగళవారం, గురువారం, శనివారం -లభ్యమవుతాయని మంత్రి వివరించారు. ఈ మార్గంలో నడిచే విమానాలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్లోని ప్రముఖ చాంగీ ఎయిర్పోర్ట్కు నేరుగా చేరనున్నాయి.