విజయవాడ బస్టాండ్ సమీపంలోని బాలాజీ హోటల్లో శనివారం ఉదయం ఈగల్ టీమ్తో కలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా.. అకస్మాత్తుగా తన వద్ద ఉన్న తుపాకీతో పోలీసు అధికారులపై కాల్పులు జరిపేందుకు యత్నించాడు. ఆ సమయంలో సదరు వ్యక్తి ట్రిగ్గర్ నొక్కినప్పటికీ.. టెక్నికల్ లోపం కారణంగా బుల్లెట్ చాంబర్లోకి రాలేదు. దీంతో అధికారులు తప్పించుకున్నారు. నిందితుడిని తెలంగాణలోని వరంగల్ జిల్లా నెల్లికుదురు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

