దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.60 పెంచింది. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే కమర్షియల్ 19 కిలోల సిలిండర్ ధరను రూ.114.5 పెంచింది. ఈ పెంచిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

