
దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం వరుసగా ఎనిమిదో రోజు మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ ఉదయం లాభాల్లో మొదలైనా.. చివరకు నష్టాలు తప్పలేదు. క్రితం సెషన్తో పోలిస్తే సెన్సెక్స్ 80,541.77 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం వరకు మళ్లీ కోలుకున్నా కొద్దిసేపటికే మళ్లీ తగ్గాయి. ఇంట్రాడేలో 80,677.82 పాయింట్ల గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 80,201.15 పాయింట్లకు చేరింది.