
టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన మంచి మనసు చాటుకున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి ముందుకొచ్చారు. కామారెడ్డిలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురష్కారాన్ని అందుకున్న బాలయ్య.. ఈ సందర్భంగా ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.