
సుప్రీంకోర్టు జడ్జి దినేశ్ మహేశ్వరి 23వ లా కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఆయనతో పాటు కమిషన్ సభ్యులుగా డీపీ వర్మ, హితేశ్ జైన్లను నియమిస్తూ ప్రధాని మోదీ ఉత్తర్వులు జారీ చేశారని, దీంతో వారు మంగళవారం బాధ్యతలు చేపట్టారని న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2019లో సుప్రీం కోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మహేశ్వరి 2023 మేలో సుప్రీం కోర్టు జడ్జీగా పదవీ విరమణ చేశారు.