
అసోంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లవ్ జిహాద్కు వ్యతిరేకంగా నూతన బిల్లును తీసుకురానున్నట్లు ప్రకటించింది. “ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చారిత్రక బిల్లులను ప్రవేశపెట్టనున్నాం. లవ్ జిహాద్, బహుభార్యత్వం, సత్రాల రక్షణ లాంటి కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాం. ఈ బిల్లులను సభలో పెట్టి చర్చిస్తాం. డ్రాఫ్ట్ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపాక మీడియాకు వివరిస్తాం” అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.