రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల బాధిత మహిళ.. మరోసారి వార్తల్లోకి వచ్చారు. తాజాగా, తనపై దాడి చోటుచేసుకుందని ఆమె ఆరోపించారు. రైల్వే కోడూరు టోల్ గేట్ వద్ద పూలు కొనేందుకు వెళ్లిన తనపై జనసేన కార్యకర్తలు దాడిచేశారని ఆమె ఆరోపించారు. తనను మోసం చేసిన అరవ శ్రీధర్పై ఏం చర్యలు తీసుకున్నారని రోజూ ప్రశ్నిస్తున్నందుకే తనను టార్గెట్ చేశారని దుయ్యబట్టారు. దీనిపై జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

