
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఒక వృద్ధ రైతు రెవెన్యూ సదస్సులో తన భూ సమస్యను చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ASI రామచందర్, ఆ రైతును మెడ పట్టుకుని నిర్దాక్షిణ్యంగా తహశీల్దార్ ఛాంబర్ నుంచి బయటకు గెంటాడు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ASI రామచందర్ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు.