
ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీకి సంబంధించి కీలక ఆదేశాలు జారి చేశారు. రేషన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడానికి రేషన్ డీలర్లు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఖచ్చితమైన బరువుతో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని చెప్పారు. రేషన్ దుకాణాల్లో ధరల బోర్డులు, స్టాక్ బోర్డులు, పోస్టర్ల ప్రదర్శన సరైన విధంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.