
ఏపీలో కూటమి ప్రభుత్వం పాత పద్దతిలోనూ జూన్ ఒకటి నుంచి రేషన్ డిపోల వద్దనే రేషన్ ఇచ్చేలా మార్పులు చేసింది. ఈ ప్రక్రియను జూన్ ఒకటి నుంచి ప్రారంభించింది.. సరిగ్గా అదే రోజు కోనసీమలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండార్లంకలో ఓ రేషన్ డిపో నుంచి 40 బస్తాలు ట్రాక్టరులో వేరే ప్రాంతానికి తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు పట్టుకున్నారు.