
శుక్రవారం (జూన్ 6) నుంచి ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. డీఎస్సీ పరీక్షలకు మొత్తం 154 పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని డీఎస్సీ కన్వీనర్ ప్రకటించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు 90 నిమిషాలు ముందే చేరుకోవాలని సూచించారు. ఎవరికైనా హాల్టికెట్లో ఫొటో లేకపోతే.. అటువంటి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు ఫొటోలు తీసుకురావాలన్నారు.