ఇండియన్ బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు కృత్రిమ మేధ సేవల (ఏఐ సర్వీసులు)పై దృష్టి కేంద్రీకరించింది. రిలయన్స్ ఎంటర్ ప్రైజెస్, మెటాకు చెందిన అనుబంధ సంస్థ ఫేస్బుక్ ఓవర్సీస్, ఐఎన్సీ కలిసి ఈ జాయింట్ వెంచర్ను ప్రారంభించనున్నాయి. రూ.855 కోట్ల పెట్టుబడితో ప్రారంభించనున్న ఈ జాయింట్ ఏఐ వెంచర్లో రిలయన్స్ ఎంటర్ప్రైజెస్ 70 శాతం వాటా కాగా, మెటా అనుబంధ సంస్థ అయిన ఫేస్బుక్ ఓవర్సీస్ 30 శాతం వాటాను కలిగి ఉంటాయని రిలయన్స్ తెలిపింది.

