రాజీనామాలు ఆమోదించాలని ఏపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు మండలి చైర్మన్కు విన్నవించారు సోమవారం ఏపీ మండలి చైర్మన్ మోషేన్రాజును కలిశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం వెల్లడించాలని హైకోర్టు మండలి చైర్మన్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రతిని సోమవారం మండలి చైర్మన్కు అందజేశారు. ఆయనతో పాటు మిగత ఎమ్మెల్సీలు పద్మశ్రీ , కల్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, మర్రి రాజశేఖర్, జాకియాఖానం మండలి చైర్మన్ను కలిసి మరోసారి విన్నవించారు.

