
భారతదేశంలో కోవిడ్ -19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలు మాస్క్ ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలను ఎవరైనా ఎదుర్కొంటే.. వారు సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని తెలిపింది.