
కర్ణాటకలో చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు యూపీఐ (UPI) చెల్లింపులను అంగీకరించడం మానేశారు. నగదు లావాదేవీలకు తిరిగి మారుతున్నారు. దీనికి కారణం కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ జీఎస్టీ నోటీసులు పంపుతూండటమే. లక్షల రూపాయల పన్ను బకాయిలుఉన్నాయని కట్టాలని ఈ నోటీసులు జారీ చేస్తున్నారు. బెంగళూరు, మైసూరు, తర ప్రాంతాలలో చాలా మంది వ్యాపారులు యూపీఐ క్యూఆర్ కోడ్లను తొలగించారు. నగదు మాత్రమే అని బోర్డులు ఏర్పాటు చేశారు.