
ప్రతిష్ఠాత్మక ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, జేఎన్టీయూ వంటి స్టేట్ యూనివర్సిటీలలో ప్రమాణాలు పడిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో కలిపి 2,816 పోస్టులు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 2,059 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ ఆందోళన వ్యక్తంచేశారు. వర్సిటీలో బోధన కుంటుపడిందని సీనియర్ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.