మొంథా తుపాన్ కారణంగా డిగ్రీ మూడో విడత ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీల్లో ఉన్నత విద్యామండలి సవరనలు చేసింది. రిజిస్ట్రేషన్లకు అక్టోబరు 29 వరకు గడువు ఇచ్చింది. ధ్రువపత్రాల అప్లోడింగ్ నవంబరు 1, పత్రాల పరిశీలన, వెబ్ ఐచ్ఛికాల నమోదుకు నవంబర్ 2 వరకు పొడిగించింది. 3న వెబ్ ఐచ్ఛికాల మార్పు, 4న సీట్ల కేటాయింపు చేయనున్నట్లు పేర్కొంది. సీట్లు పొందిన విద్యార్ధులు సంబంధిత కాలేజీల్లో నవంబరు 7వ తేదీలోపు చేరాల్సి ఉంటుంది.

