
దేశంలోని వైద్య విద్య కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-యూజీ పరీక్షను మే 4వ తేదీన నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఈ పరీక్ష కోసం శుక్రవారం నుంచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. మార్చి 7వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఎంబీబీఎస్ కోర్సులో మొత్తంగా 1.08 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో దాదాపు 56 వేలు ప్రభుత్వ ఆస్పత్రులు, దాదాపు 52వేలు ప్రైవేటు కాలేజీల్లో ఉన్నాయి.