
ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో మహామృషి దేవరహ బాబా ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని వాటర్ ట్యాంకు నీటి నుంచి దుర్వాసన రావడాన్ని గ్రహించారు. వాటర్ ట్యాంకును పరిశీలించగా అందులో కుళ్లిన మృతదేహం కనిపించింది. అయితే గత పది రోజులుగా ఆ ట్యాంకులోని నీటిని మెడికల్ విద్యార్థులు, సిబ్బంది తాగారు. ఈ విషయం తెలిసి వారు షాక్ అయ్యారు.