అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు సంచలన ఆరోపణలు చేశారు. యూకేకు పంపిన మృతదేహాలు తమ వారివి కావని డీఎన్ఏ పరీక్షల్లో తేలిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సహాయం విషయంలోనూ బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమతో బలవంతంగా సంతకాలు చేయించారని ఆరోపించారు. రెండు మృతదేహాలు తారుమారైనట్టు ఫ్యామిలీ ఆరోపణలు ఆరోపణలపై స్పందించిన భారత ప్రభుత్వం.. డీఎన్ఏ పరీక్షల్లో సమస్యపై కూడా యూకే అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.

