హైదరాబాద్ మూసాపేటలోని ఇన్లాండ్ కంటైనర్ డిపోలో ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది. కస్టమ్స్ క్లియర్ కాని లిక్కర్ను కస్టమ్స్ అధికారులు గోడౌన్లో భద్ర పరిచారు. లిక్కర్ భద్రపరిచిన గోడౌన్లోనే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఉదయం 9 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. గోడౌన్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు..ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేశారు. ఈ అగ్నిప్రమాదంలో లిక్కర్ బాటిళ్లు, ఇతర మెటీరియల్స్ కాలి బూడిద అయ్యాయి.

