
ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లోని మెస్టన్ రోడ్లోని మిస్రీ బజార్లో బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండు స్కూటర్లు చెల్లాచెదురయ్యాయి. దీంతో మిస్రీ మార్కెట్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఉర్సులా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. పేలుడుకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు.