
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో గురువారం (జూన్ 5) మారోమారు భద్రతా దళాలు ఎన్కౌంటర్ నిర్వహించాయి. ఈ దాడిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందారు. ఆయనపై రూ.40 లక్షల రివార్డు ఉంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంకి చెందిన సుధాకర్ అలియాస్ సింహాచలం.. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పని చేస్తున్నారు.