
సాధారణంగా రాజకీయాల్లో ఉండేవారు.. వాటిని వదులుకోలేరు. ఆవేశంలో నిర్ణయం తీసుకున్నా.. ఆ తర్వాత మళ్లీ పాలిటిక్స్ వైపే చూస్తారు. వైసీపీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి అనే రేంజ్ ఉండేది. కానీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ఆ తర్వాత విజయసాయి రెడ్డి సైలెంట్ అయిపోవడం, ఇటీవల పార్టీకి గుడ్పై చెప్పి.. రాజకీయాలకే గుడ్పై చెబుతున్నానని చెప్పడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్లపోతున్నారు అనే ప్రచారం పొలిటికల్ హాట్ టాపిక్ అయ్యింది..