
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఉప్పాడ హార్బర్ నిర్మాణ పనుల వల్ల మత్స్యకారుల బోట్లు దెబ్బతిన్నాయి. ఇటీవల పవన్ ఉప్పాడ ప్రాతంలో పర్యటించారు. ఈ మేరకు తన సమస్యలను మత్స్యకారులు ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాము నష్టపోయామని.. తమకు పరిహారం రాలేదని చెప్పారు. దీంతో ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు.. మత్స్యకారులకు తాజాగా రూ. 72 లక్షల పరిహారం విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.