బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు మరో అవినీతి కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పూర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టు భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢాకా లోని ప్రత్యేక కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది ఇదే కేసులో హసీనా సోదరి షేక్ రెహానాకు ఏడేళ్లు, ఆమె మేనకోడలు, బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిఖీకి రెండేళ్ల జైలుశిక్షను కోర్టు ఖరారు చేసింది.

