
సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రబలంగా ప్రవేశించి దేశం అంతటా వర్షాలు కురవడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది ఈ రుతుపవనాలు కొంత ముందుగానే దక్షిణాంధ్రను తాకినప్పటికీ, అనూహ్యంగా నెమ్మదించిపోయాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటున్నాయని వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ తర్వాతే రుతుపవనాల్లో మళ్లీ కదలిక వచ్చి, అవి చురుగ్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.