
కాంగ్రెస్ పార్టీలో మేడారం జాతర పనుల చిచ్చు రగులుతూనే ఉన్నది. అయితే మంత్రుల మధ్య వివాదాలకు కారణమంటూ కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను ప్రభుత్వం ఉన్నఫలంగా తొలగించింది. ఈ వ్యవహారం కొనసాగుతుండగానే దేవాదాయ శాఖ మంత్రికి రేవంత్ రెడ్డి సర్కార్ షాకిచ్చింది. మేడారం అభివృద్ధి పనులను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించింది. తక్షణమే రికార్డులు అప్పగించాలని మంత్రి కొండా సురేఖకు చెందిన దేవాదాయ శాఖకు ఆదేశాలు జారీచేసింది.