ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సుమారు ఏడుగురు మరణించగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. అయితే పెద్ద పెద్ద కార్యాలయ భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్లు,
రాయబార కార్యాలయాలు ఉన్న వాణిజ్య షహర్-ఎ-నావ్ పరిసరాల్లోని ఒక హోటల్ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, షహర్-ఎ-నవ్ కాబూల్లోని అత్యంత సురక్షితమైన ప్రాంతాలలో ఒకటిగా పరిగణిస్తారు. గాయపడిన వారు కాబూల్లోని సర్జికల్ సెంటర్లో చికిత్స పొందుతున్నారని ఎన్జీఓ ఎమర్జెన్సీ తెలిపింది.

