
మంగళవారం జరిగే స్పేస్ ఎక్స్ (Space X) ప్రయోగంలో మరో ముగ్గురితో కలిసి భారత్కు చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షానికి పయనం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భారత అంతరిక్ష సామర్థ్యాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇస్రో-నాసా మిషన్ వెళ్లడంపై హర్షం వ్యక్తం చేశారు.