మానవతా సహాయ మిషన్లో భాగంగా న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఇరాన్ చెందిన మహాన్ ఎయిర్ పౌర విమానంపై అమెరికా దాడి చేసింది. మషాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనలో విమానం దెబ్బతింది. భారత్ కు వెళ్లాల్సిన ప్రణాళికాబద్ధమైన సహాయ కార్యకలాపాలు నిలిచాయి. ఈ ఘటన పట్ల ఇరాన్ స్పందించింది. దీన్ని వార్ క్రైమ్ గా అభివర్ణించింది. భారత్ స్పందించాల్సిన అవసరం ఉందని సూచించింది.

